Republic day: ఏపీ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పతి చోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
గణతంత్ర వేడుకలకు సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హజరైయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకితభావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తొందన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొందనీ, ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తొందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకే అందిస్తున్నారని అన్నారు. 56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు అమలు అవుతున్నాయన్నారు. ఏపీ సంక్షేమ పాలనకు అభినందనలు తెలియజేస్తూ ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు.
పరేడ్ లో వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్సనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకత తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్, సీఎం జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు.
Pawan Kalyan: చంద్రబాబుకు షాకిచ్చేలా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు