తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించమని హైకోర్టు ఆదేశించిన తర్వాత జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది.
అయితే అక్కడ సుప్రీం కోర్టులో మూడుసార్లు విచారణ జరిగినా స్టే ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళిన రమేష్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార. దీంతో మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్గా నియమించే అధికారం గవర్నర్కు ఉంది అని హై కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం స్టే ఇవ్వనందున హైకోర్టు తీర్పు అమలులోనే ఉన్నట్టే అని చెప్పిన ధర్మాసనం గవర్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్కు సూచించింది.అలాగే దీనికి ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించి వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది.