AP DSC: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీ లు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 43 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ రోజు (ఫిబ్రవరి 12) నుండి 21వ తేదీ వరకూ ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుండి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకూ ఒక సెషన్..మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
మార్చి 31వ తేదీన ప్రాధమిక కీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 న ప్రాధమిక కీ పై అభ్యంతరాలను స్వీకరించి ఏప్రిల్ 2న ఫైనల్ కీ .. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుననున్నాయి. cse.apgov.in వెబ్ సైట్ లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరి అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. రిజర్వ్ కేటగిరి అభ్యర్ధులకు మరో ఐదేళ్లు పెంచారు.