సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోడీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్ లల్లా విగ్రహం వద్ద పూజలు చేసారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ పాల్గొన్నారు. మరో పక్క రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం అధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మారుమోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి సుమారు ఏడు వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించి తరించారు.
ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని 114 కుండలతో వివిధ తీర్థ స్థలాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయిస్తారు. అనంతరం అయోధ్య రామ మందిరంలో సామాన్య ప్రజల కోసం తెరుస్తారు.
Rahul Gandhi: ఆలయ ప్రవేశానికి అనుమతి నిరాకరణ .. నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ