బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇకపై హై వోల్టేజ్ యాక్షన్ కు ప్రేక్షకులంతా రెడీ అయిపోయారు. అయితే టాస్కు ల్లో అంత పస లేకపోవడంతో ఈ షో చాలా చప్పగా సాగుతుంది. ఇక ఫినాలే టిక్కెట్ ఒకటే మిగిలి ఉంది. అది కూడా ఈ వారం అయిపోతుంది. ఇక చివరి దశలో షో ప్రసార సమయంలో మార్పులు చేయడం ఆ చానెల్ వారికి అలవాటు గా వస్తుంది.
గత సీజన్లలో కూడా చివరి రెండు మూడు వారాల్లో బిగ్ బాస్ షో ప్రసారమయ్యే సమయాన్ని మార్చేశారు. చివరి వారాలు కనుక కచ్చితంగా అందరూ చూస్తారు అనే ధైర్యంతో వారు ఇలా చేస్తూ ఉంటారు. కొత్త సీరియల్ కూడా స్టార్ మా లో ప్రసారం కాబోతోంది. ఏడు గంటలకు వస్తున్న వదినమ్మ సీరియల్ బాగానే క్లిక్ అయింది. అయితే దేవత సీరియల్ వల్ల మౌనరాగం టైమింగ్స్ మార్చేశారు మౌనరాగం ముందు రావడంతో చిట్టితల్లి మరింత వెనక్కి వెళ్ళిపోయింది.
కొత్త సీరియల్ ను ప్రైమ్ టైమ్ లోనే వేయాలి అన్నది వారి ప్లాన్. సాయంత్రం 7:00 8:00 అనేవి ప్రైమ్ టైం. ఈ సమయం సీరియల్స్ కి చాలా కీలకం. అందుకే కొత్తగా రాబోతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ను వదినమ్మ సమయంలో వేస్తున్నారు. వదినమ్మ సీరియల్ 9:30 గంటలకు మార్చారు. అయితే అది బిగ్ బాస్ షో ప్రారంభ సమయం కావడం విశేషం.
కాబట్టి బిగ్బాస్ ఒక అరగంట వెనక్కి జరిపి 10 గంటల నుండి వేయనున్నారు. దీంతో సిరిసిరి మువ్వలు, ఆమె కథ సీరియల్ లో కి అవకాశం లేకుండా పోయాయి. కాబట్టి వచ్చే వారం నుండి బిగ్ బాస్ షో 10 గంటలకు మొదలుకానుంది. శని ఆదివారాల్లో మాత్రం షో యథాతథంగా ప్రసారం అవుతుంది