BJP: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇప్పటికే ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ నేడు శాసనసభ స్థానాలను ప్రకటించింది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నది. ఈ క్రమంలో పది మంది అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్ధులు
- ఎచ్చెర్ల – ఎన్ ఈ ఈశ్వరరావు
- విశాఖ నార్త్ – పి విష్ణుకుమార్ రాజు
- కైకలూరు – కామినేని శ్రీనివాస్
- అరకు – పంగి రాజారావు
- విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
- బద్వేల్ – బొజ్జ రోషన్న
- జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
- ధర్మవరం – సత్యకుమార్
- అనపర్తి – ఎం శివకృష్ణంరాజు
- ఆదోని – పార్థసారధి
Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు