Breaking: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ తో పాటు మరి కొందరిపైనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్ఎ) కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరి కొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది ఈడీ.
కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని వీణాతో పాటు ఆమె సంస్థ, మరి కొందరిపై ఈడీ పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే సంస్థ .. వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి 2018 – 19 మధ్య అక్రమంగా రూ.1.72 కోట్లు చెల్లింపులు జరిపినట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్ మినరల్స్ కు ఎక్సాలాజిక్ ఎలాంటి సర్వీస్ అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ పేర్కొంది. దీంతో ఎక్సాలాజిక్ పై ఎస్ఎఫ్ఐఓ విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించారు.
మరో వైపు ఎస్ఎఫ్ఐఓ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం విజయన్ కుమార్తె పై ఈడీ కేసు నమోదు కావడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయ్యింది.
YSRCP: కుమారుడు జగన్కే విజయమ్మ ఆశీస్సులు