Rajamouli : టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కి గతంలో శ్రీదేవి కుటుంబంతో జరిగిన వివాదం గురించి తెలిసిందే. అసలు ‘బాహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ముందు శ్రీదేవి వద్దకు వెళ్ళింది. రాజమౌళి ఆమెకు పాత్ర గూర్చి వివరించాక ఆమె అసాధారణ డిమాండ్ చేశారని అతను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఒక హోటల్ ఫ్లోర్ మొత్తం తమ కోసం బుక్ చేయాలని…. తమతో పాటు వచ్చే టీం కి కూడా బిజినెస్ క్లాస్ టికెట్లు ఇవ్వాలని వీటన్నింటితో పాటు భారీ పారితోషికం కూడా డిమాండ్ చేశారని రాజమౌళి గతంలో వెల్లడించారు.
అయితే ఆ తర్వాత వ్యాఖ్యలపై శ్రీదేవి స్పందించి, ఖండించి, ఆవేదన వ్యక్తం చేసింది. ఇక రాజమౌళి మనస్తత్వం మనందరికీ తెలిసిందే. అతను మాటకు మాట చెప్పకుండా ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దాం అంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక దాంతో ఆ కథ ముగిసింది అని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీదేవి భర్త బోనీకపూర్ మరొకసారి రాజమౌళి పై నిప్పులు చెరిగారు. అతని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘మైదాన్’ సినిమా ను దసరా సందర్భంగా రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.
అయితే రాజమౌళి దర్శకత్వం వహిస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా అప్పుడే విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. దీనిపై బోనీకపూర్ విమర్శలు చేశారు. రాజమౌళికి నైతికత లేదని కామెంట్ చేశారు. సరే ఈ విషయం గురించి ఆయన ఎంత మాట్లాడినా బాగుంటుంది. అక్కడితో ఆగకుండా తన భార్యతో రాజమౌళికి ఉన్న పాత వివాదానికే బయటికి లాగారు. గతంలో శ్రీదేవి అన్ ప్రొఫెషనల్ అని రాజమౌళి వ్యాఖ్యానించారు కానీ నిజానికి రాజమౌళి అన్ ప్రొఫెషనల్ అని వెల్లడించారు.
గతంలో రాజమౌళి ముంబై కి వచ్చి శ్రీదేవి కి కథ చెప్పినప్పుడు ఆమె పెద్దగా ఆసక్తి చూపకపోతే తానే స్వయంగా ఈగ, మగధీర చిత్రాలను చూపించి రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేయాలని సిఫారసు చేసినట్లు బోనీ వెల్లడించారు. అయితే రాజమౌళి ఆమె గురించి తర్వాత చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం బాగోలేదని బోనికపూర్ అన్నారు. రాజమౌళి పూర్తిగా అన్ప్రొఫెషనల్ అని…. అతనికి సీనియర్లంటే కనీస గౌరవం లేదని అనిపిస్తోంది అని బోనీ వ్యాఖ్యానించడం గమనార్హం.