Breaking : కర్నాటక రాష్ట్రంలోని చిక్ బళ్లపూర్ లో భారీ పేలుడు సంభవించింది. జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిక్ బళ్లాపూర్ జిల్లా హీరానాగవేలి సమీపంలోని రాతి క్వారీలో కొద్ది రోజుల క్రితం జిలెటిన్ స్టిక్స్ ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఉపయోగించడానికి ఇప్పుడు అనుమతి లేదని అధికారులు కాంట్రాక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ నేపథ్యంలో క్వారీలో సిబ్బంది ఏర్పుటు చేసిన జిలెటిన్ స్టిక్స్ ను నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు.
కాగా ఘటనా స్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్ సందర్శించారు. అక్రమంగా పేలుడు పదార్ధాలను నిల్వ చేసిన క్వారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.