Breaking: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్ జిల్లా మతంపూర్ ప్రాంతంలో శనివారం రాత్రి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడింది. ఈ దుర్గటనలో 22మంది దుర్మరణం చెందగా మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే స్థానికులు కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.
భాదితులు అంతా ఉన్నావ్ లోని చంద్రిక దేవి ఆలయాన్ని దర్శించుకొని వారి స్వగ్రామం కోర్తాకు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో 50మంది వరకు ఉన్నట్టు సమాచారం. కాగా ఈ దుర్ఘటనపై ప్రసిడెంట్ ద్రౌపది ముర్మూ, ప్రధాన మంత్రి మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షంచారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.50 ఆర్ధిక సహాయం ప్రకటించారు పీఎం మోడీ. ఈ ఘటన హృదయ విధారకరమణి యూపీ సియం యోగి అన్నారు. జిల్లా అధికారులు హుటాహుటిన ఘటన స్థలం వద్దకు వెళ్లి యుద్ధ ప్రతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.