తెలంగాణ హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయింది. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలపై పలుమార్లు తన అసహనాన్ని ప్రదర్శించిన కోర్ట్ ప్రభుత్వం ఎంతకీ మాట వినకపోవడంతో తన స్వరాన్ని మరింత పెంచింది.
తెలంగాణ పౌరులు తమ ప్రాధమిక జీవన హక్కును కోల్పోతున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. మే 23 నుండి జూన్ 23 వరకూ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని టెస్ట్ లు చేసింది? అందులో లక్షణాలు ఉన్నవాళ్లు ఎంత మంది, లేని వాళ్ళు ఎంత మంది.. ఇలా మొత్తం నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జులై 17 కల్లా ఇవ్వలేని పక్షంలో అధికారులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.