CM Revanth Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ తరుణంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల భేటీకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రకరకాల ఊహగానాలతో సోషల్ మీడియాలో సెర్క్యులేట్ అవుతున్నాయి.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆయన నివాసానికి వెళ్లి ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిన సందర్భం లేదు. కానీ మొదటి సారిగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో రోమర్స్ స్టార్ట్ అయ్యాయి. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేమి లేదు.
గతంలో సీఎంగా కేసిఆర్ ఉన్న సమయంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలిసిన సందర్బాలు ఉన్నాయి. అయితే సెక్రటేరియట్ గానీ అసెంబ్లీలో గానీ ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు కలిస్తే పెద్దగా వదంతులు వ్యాపించే అవకాశం ఉండదు. అయితే రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడంపైనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఎమ్మెల్యే లు వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు.
తాము మర్యాదపూర్వకంగానే సీఎం ను కలిశామని, తమ నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించామని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు.
తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆ నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల భద్రత, ప్రోటోకాల్, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అంశాలు తప్ప మరే ఇతర అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని వారు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మవద్దని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
సచివాలయంలో అపాయింట్మెంట్ కుదరక సీఎం ఇంటికి రమ్మన్నారని అందుకే నివాసానికి వెళ్లి కలిసినట్లు సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసినట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అంటూనే .. ప్రధాని మోడీని సీఎం ఎలా కలిశారో .. అలానే తాను భేటీ అయినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ లో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు.
AP Assembly Speaker: వాళ్లకు షాకిచ్చిన స్పీకర్ .. గంటా రాజీనామా ఆమోదం .. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు