తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆధ్వర్యంలో వచ్చిన మొదటి ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలవడంతో ఆయన పేరు మారుమ్రోగుతోంది. బీజేపీ హైకమాండ్ పెద్దలు బండి సంజయ్ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా బిజెపి భారీ స్థాయిలో గెలుస్తుంది అంటూ బండి సంజయ్ గతంలోనే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పొత్తుల గురించి తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అంటూ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ యే మా ప్రధాన ప్రత్యర్థి అంటూ ధ్వజమెత్తారు. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బిజెపి ఎలక్షన్ కమిటీ భేటీలో అభ్యర్థుల ఖరారు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ అధికార పార్టీ టిఆర్ఎస్ కలిసి దేశ విద్రోహక శక్తులకు సహాయం చేస్తున్నారని భాగ్యనగరం పరువు తీస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
అదేవిధంగా నగరంలో వరదల కారణంగా పేదలు సామాన్యులు అష్ట కష్టాలు పడితే ముఖ్యమంత్రి కెసిఆర్ కనీసం స్పందించలేదని సీరియస్ అయ్యారు. కచ్చితంగా గ్రేటర్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని ఎంఐఎం పార్టీ దక్కించు కోకుండా అడ్డుకుంటామని కాషాయ జెండా ఎగరేస్తాం అంటూ బండి సంజయ్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా వంద స్థానాలకు పైగానే బిజెపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుండి క్యాడర్ ఉందని అధికార పార్టీ టిఆర్ఎస్ కి మాకు ఉన్న క్యాడర్ వారికి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుంది అని స్పష్టం చేశారు.