Buchaiah Chowdary: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల దిశ యాప్ అవగాహన కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రసంగంలో తడబాటులో వచ్చిన ఓ మాట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏ పార్టీ అయినప్పటికీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఒక్కో సందర్భంలో మాటల తడబాటు సహజమే. గతంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ అదినేత చంద్రబాబు కూడా ప్రసంగంలో తడబాటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇక లోకేష్ విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో ఉఛ్చారణ దోషాలు కనబడ్డాయి.
అయితే లోకేష్ టంగ్ స్లిప్ అయిన ప్రతి సందర్భంలోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆ వీడియోలను ట్రోల్ చేసి ఆడేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ వారికి జగన్ చిక్కారు. గత కొంత కాలంగా జగన్ బెయిల్ రద్దు అయితే భారతిరెడ్డి సీఎం అవుతారని, ఇప్పటికే ఆమె పరిపాలనపై అవగాహన కోసం తర్ఫీదు పొందుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో గొల్లపూడిలో జరిగిన సభలో సీఎం జగన్ నోటి వెంట “ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ఒక మహిళ” అని తడబాటులో అనడంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఆ వీడియోను వైరల్ చేసింది. దీనిపై ఆ పార్టీ వర్గాలు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.
Read More: Brahmamgari Matam: బ్రహ్మం గారి మఠం పీఠాధిపత్యం వివాదంలో కొత్త ట్విస్ట్..! అదేమిటంటే..!?
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తన సతీమణి భారతిరెడ్డిని సీఎం చేయాలనే ఆలోచనను ఇలా బయటపెట్టారా అని బుచ్చయ్య ప్రశ్నించారు. “ఏంటి సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు.. భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బహిర్గతం చేసారా..? లోపల మాట్లాడుకునే మాటలు మీ వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకు ఇలా మాటలు వదిలినట్టు ఉన్నారు. జైలు కి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు అని అంతః పురం టాక్.. ! అందుకే ఇలా కంఫ్యూషన్ లో మాటలు నిజాలు గా వచ్చేసాయి” .. అని అంటున్నారని సెటైర్ వేశారు బుచ్చయ్య చౌదరి.