న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కోవిడ్ 19 కేసులు రోజు రోజు కు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య లక్ష 25 వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,654 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24గంటల్లో మరో 137 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101 కు చేరుకోగా 69597 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3720కు చేరుకున్నది. కరోనా నుంచి 51,784 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కేసులు ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తున్నాయి. కొత్తగా 2940 కేసులు నమోదవ్వడంతో…ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 44582కి చేరింది. ఇక ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ లలో కూడా పది వేలకు పైగా కేసులున్నాయి.