Enforcement Directorate: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై పోలీసులు కేసు నమోదు చేయడం తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ అధికారులు తమ విధులను ఆటంకం కల్గించారని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ(డీవీఏసీ) అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెలితే.. తమిళనాడు మధురై లో ఈడీ అధికారిగా పని చేస్తున్న అంకిత్ తివారీని లంచం కేసులో ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీవీఏసీ అధికారులు తనిఖీ కోసం స్థానిక ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సోదాలు జరుపుతుండగా ఈడీ అధికారులు వారిని అడ్డుకున్నారు. దీనిపై డీవీఏసీ అధికారులు మధురై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈడీ అధికారులపై కేసు నమోదు చేశారు.
అవినీతి కేసులో నిందితుడైన ఈడీ అధికారి అంకిత్ తివారీ ఓ ప్రభుత్వ అధికారి ఆస్తులకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా డీవీఏసీ అధికారులు పట్టుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (ఈడీ) కార్యాలయంపై రాష్ట్ర అధికారులు తనిఖీకి వెళ్లడం, ఈడీ అధికారులపైనే కేసు నమోదు చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
Breaking: సంచలన వ్యాఖ్యల ఫలితం .. మడకశిర తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు