దాదాపుగా మన మొబైల్ నెంబర్ పోలి ఉన్న నెంబర్ తో కానీ మరి ఏదైనా నా నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది..! దాని సారాంశం ఏమిటంటే..?
అయ్యా.. నేను ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు నిమిత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నా నంబర్ బదులుగా పొరపాటున మీ నెంబర్ పడింది. ఆన్లైన్లో నెంబర్ మార్చుకునే అవకాశం లేదు. దయచేసి మీరు ఏమీ అనుకోకుండా మీ నెంబర్ కు నాకు రావాల్సిన ఓటిపి మీకు వస్తుంది.ఆ ఓటిపి ని నాకు చెప్తే మీరు నాకు ఎంతో హెల్ప్ చేసినవారవుతారు. ఈ ఉద్యోగం మీద నా కుటుంబంతో పాటు నా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అంటూ ఎంతో రిక్వెస్ట్ మ్యానర్లో సంభాషణ ఉంటుంది. వారి అమాయకులకు మాటలను నమ్మి ఒకవేళ మనం వాళ్లకు ఓటిపి చెప్పామో మన అకౌంట్ లో డబ్బు గోవిందా..!
అప్పటికే తన దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించి ఉన్న వివరాల ద్వారా మీ అకౌంట్లో నుంచి డబ్బులు కాల్ కాజేయడానికి
వాళ్లు ఆ ఓటిపి ని ఉపయోగించి మన ఆన్లైన్ బ్యాంకింగ్ ని వారి అధీనంలోకి తెచ్చుకుంటారు. కాబట్టి మన ఫోన్ కు ఎలాంటి ఓటీపీ లు వచ్చినా కూడా అవి ఇతరులకు చెప్పడం అవసరం లేదన్నా చిన్న విషయాన్ని మర్చిపోయి పెద్ద మొత్తంలో నష్ట పోతున్నారు.
ఇలాంటి ఆగడాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు:
కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపిస్తూ ఖాతాలను కొల్లగొట్టారు. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ఫోన్, కంప్యూటర్ మీద గడపడంతో వారి పని మరింత సులువైంది. రిలయన్స్ జియో సంస్థకి రోజుకి 25 జీబీ మొబైల్ డేటా ఆరునెలల పాటు ఉచిత ఫోన్ కాల్స్ అందిస్తుందని. అలాగే 498 రూపాయల విలువైన ఉచిత రీఛార్జ్ జియో అందిస్తుందని ఈ లింక్ క్లిక్ చేయండి. అంటూ మెసేజ్ వాట్సాప్ లో సర్క్యులేట్ అయింది. పొరపాటున క్లిక్ చేస్తే ప్రైమ్ అఫైర్స్ ఏపీకే పేరుతో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. ఇన్స్టాల్ చేస్తే నీ ఫోన్ పూర్తిగా కంట్రోల్ లోకి వెళ్తుంది. మీకు తెలియకుండానే మీ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు చూడటంతో పాటు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు మీ లొకేషన్, మైక్రోఫోన్ యాక్సెస్ వంటివి హ్యాకర్ నియంత్రణలోకి వెళ్తాయి. బ్యాంకు లో నుంచి వివిధ రకాల లోన్లు తీసుకున్న వారికి క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఇటీవల మారిటోరియం ప్రకటించింది. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈఎంఐ వాయిదా వేయాలి అంటే మీ బ్యాంకు ఖాతా లేదా క్రెడిట్ కార్డు వివరాలను చెప్పి ఆక్టివేట్ చేసుకోవాలని. పలు రకాలుగా ఫోన్లు చేసి అమాయకుల ద్వారా వివరాలు తెలుసుకొని డబ్బులు కాజేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీరి గురించి చెప్పుకుంటూ పోతే లెక్కే ఉండదు. మన బ్యాంక్ వివరాలు గానీ దానికి సంబంధించిన ఓటీపీ లు కానీ ఎవరికీ చెప్పకూడదు అన్న చిన్న విషయాన్నీ మర్చిపోయి ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న వారందరో.