జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై మరో సారి అవినీతి ఆరోపణలు రావడంతో సీబీడీటీ సస్పెండ్ చేసింది. జీఎస్టీ కేసులు మేనేజ్ చేస్తానంటూ పలువురి వద్ద నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు అభియోగాలు రావడంతో ఆయనపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సస్పెన్షన్ వేటు వేసింది. 180 రోజులు గాంధీని సస్పెండ్ చేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. గతంలోనూ ఇదే ఆరోపణలపై గాంధీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.
బొల్లినేని గాంధీ 1992 లో ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్ పెక్టర్ గా చేరారు. 2002 లో సూపర్నిటెండెంట్ గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్ – 1 లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యూటేషన్ పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి వెళ్లారు. అక్కడి నుండి 2004లో ఈడీకి వెళ్లి 2017వరకూ విధులు నిర్వహించారు. ఆయన ఈడీలో ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ఆస్తుల కేసు, సుజనాచౌదరి కంపెనీల కేసులు దర్యాప్తు చేశారు. అనంతరం జీఎస్టీకి బదిలీ అయ్యారు.
నిబంధనలకు విరుద్దంగా బొల్లినేని గాంధీ కి కీలక పోస్టులు లభించడం వెనుక నాడు చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. 2010 – 19 మధ్య కాలంలో బొల్లినేని గాంధీ తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా స్థిర, చరస్తులను కూడబెట్టినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. 2020లో హైదరాబాద్ లో ఒక వ్యాపారి నుండి రూ.5కోట్లు లంచం అడిగారన్న ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. గత ఏడాది పిబ్రవరి 24న సెంట్రల్ జీఎస్టీ నుండి సీబీడీటీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరో సారి సస్పెండ్ అయ్యారు.
Delhi Liquor Scam: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ మూహూర్తం ఖరారు.. కవిత లేఖకు స్పందించిన సీబీఐ