Election commission: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు ఉపయోగించుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లకు ఇంకు రాసే పనులు లాంటి విధులను మాత్రమే అప్పగించాలని తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు.
అర్హులైన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించవచ్చని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకూ కీలక సూచనలు జారీ చేశారు. ప్రతీ పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని వెల్లడించింది. బీఎల్ఓలుగా వ్యవహరించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ స్పష్టం చేసింది.
బీఎల్ఓలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పింది. గ్రామ వార్డు వలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించ వద్దని స్పష్టం చేసింది. అభ్యర్ధులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వలంటీర్లను అనుమతించవద్దని స్పష్టం చేసింది.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ..’మరో పదేళ్లు సీఎంగా ఉంటా’