Medaram Jatara Prasadam: మేడారం వెల్లలేని భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మీ ఇంటి వద్దకే తల్లుల ప్రసాదాన్ని చేర్చే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
గత జాతరలో మాదిరిగానే ఈ సారి కూడా సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను ఆర్టీసీ అందిస్తొంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుంది. దేవస్థానం నుండి అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.
మేడారం మహా జాతర ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరక జరుగుతుండగా, అన్ లైన్, ఆఫ్ లైన్ లో అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు ఈ నెల 25వ తేదీ వరకూ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. భక్తులు సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్ లో రూ.299లు చెల్లించి ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు.
పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. https://rd.gy/q5rj68 లింక్ పై క్లిక్ చేసి గానీ లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చు. బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమను అందజేస్తారు. ఈ బుకింగ్ సదుపాయం తెలంగాణ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మేడారం ప్రసాద బుకింగ్ కు సంబందించి పూర్తి వివరాల కొరకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040 – 69440069, 040- 69440000, 040- 23450033 సంప్రదించాలని ఆయన సూచించారు.
PM Modi: అబుదాబీలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ