ఏపీలో అధికార వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీతో బీజేపి, జనసేన జట్టు కట్టాయి. ఈ మూడు పార్టీలున్నారు. ఇక గతంలో తన పార్టీలో ఉన్న ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను కూడా బీజేపిలోకి పంపింది చంద్రబాబు అన్నది తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరికి కూడా లోక్సభ టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనసేన సీట్ల ఎంపికలో చంద్రబాబు ముద్ర ఎలాగూ ఉంది. చాలావరకు చంద్రబాబు చెప్పిన వారికే.. పవన్ సీట్లు ఇస్తున్న పరిస్థితి.
నిన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును జనసేనలోకి పంపి.. భీమవరం జనసేన టికెట్ ఇప్పించింది కూడా చంద్రబాబు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయం సగటు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికి అయినా తెలుస్తుంది. సీఎం రమేష్కు అనకాపల్లి సీటు దాదాపు ఖరారు అయింది. ఇక రఘురామ కృష్ణంరాజుకు కూడా నరసాపురం సీటు ఇచ్చేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు మరో ఆప్తమిత్రుడు అయిన బిజేపిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎక్కడ సీటు సర్దుబాటు చేయాలా అని చంద్రబాబు ఒక్కటే తలమనుకలు అవుతున్నారు.
సుజనా చౌదరికి బీజేపి ఎంపీ సీటు రాని పక్షంలో అవస కలిసి ఎన్నికలలో వైసీపీని ఢీకొట్టబోతున్నాయి.
విచిత్రం ఏంటంటే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. టిడిపి అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ టికెట్లతో పాటు అటు జనసేన, బిజెపి టిక్కెట్లను కూడా తానే డిసైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు రఘురామ కృష్ణంరాజు పెద్ద ఉదాహరణ. ఆయనను బీజేపిలోకి పంపి నరసాపురం సీటు పొత్తులో భాగంగా.. బీజేపికి ఇచ్చి.. ఆయనకు ఎంపీ టికెట్ వచ్చేలా చక్రం తిప్పుతున్నారు. అయితే సుజనాకు బీజేపీలో సీటు రాకపోతే తెలుగుదేశంలో చేర్చుకుని ఏలూరు పార్లమెంటు సీటు అయిన ఇవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
విచిత్రం ఏంటంటే గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే జమ్మలమడుగు సీటును బీజేపికి కేటాయించారు. అయితే అక్కడ ఆదినారాయణ రెడ్డి అన్నకుమారుడు భూపేష్ రెడ్డి టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆ సీటు తనకే ఇవ్వాలంటూ భూపేష్ రెడ్డి పట్టుబడుతున్నారు. చంద్రబాబు మాత్రం గత రెండు సంవత్సరాలుగా భూపేష్ను వాడుకుని ఇప్పుడు తన మిత్రుడు ఆదినారాయణ రెడ్డి కోసం ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపికి వదులుతున్నారు.
ఇక అనంతపురం జిల్లాలోని ధర్మవరంలోనూ అదే పరిస్థితి. గత టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు స్నేహితుడు వరదాపురం సూరి కోసం పరిటాల శ్రీరామ్ని బలి పశువుని చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్ను ధర్మవరంలో వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా అపర రాజకీయ చాణిక్యుడుగా ఉన్న చంద్రబాబు.. తన కుళ్ళు రాజకీయాలను ప్రయోగించి టిడిపి, జనసేన పార్టీలలో ఉన్న తన స్నేహితులకు కూడా టికెట్లు వచ్చేలా తెరవెనక రాజకీయం నడిపిస్తున్నది వాస్తవం.