ఎస్… పైన హెడ్డింగ్ నిజం… అమరావతి ఉద్యమాన్ని మత్తు బెడుతుంది ఖచ్చింతంగా చంద్రబాబే.. అదేంటి అంత మాట అన్నారు..? పాపం మొదటి నుంచి ఆయనే కదా రైతుల తరఫున పోరాటం చేస్తుంది… జోలె పట్టి మరి విరాళాలు సేకరించింది అంటే….. ఒకటే మాట తన తప్పు ను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే… తన మీదకు తప్పు పడకుండా జాగ్రత్తలు తీసుకుని మాత్రమే చంద్రబాబు ఉద్యమాన్ని మొదలు పెట్టారు…. ఇప్పుడు కుల ముద్ర వేసి దాన్ని చంపేస్తుంది ఆయనే…. జనభేరి సభ ద్వారా ఎంతటి ప్రచారం పాజిటివ్ గా వచ్చిందో రాలేదో కానీ….. అమరావతి ఉద్యమం కచ్చితంగా ”కమ్మ ”నైనా ఉద్యమం అని మాత్రం అందరికి ప్రోజెక్టు చేసుకుంనేందుకు మాత్రం ఉపయోగపడింది…. ఇక అమరావతి ఉయామాన్ని అంతంత మాత్రంగా పట్టించుకుంటున్న తెలుగు ప్రజలు ఇక దీన్ని పూర్తిగా మర్చిపోయేలా చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు.
** మట్టి మీద పడి మొక్కితే సానుభూతి వస్తుంది అని చంద్రబాబు భావిస్తే అది నిజంగా తప్పే అవుతుంది. ఉద్యమం సంవత్త్సరం పూర్తి అయినా సందర్భంగా ఏర్పాటు చేసిన జనభేరి సభకు చంద్ర బాబు చీఫ్ గెస్ట్ గా వెళ్లడం వాళ్ళ ఉద్యమం పూర్తిగా ఒక కులానికి సంబంధించినది గా మారిపోయింది.
** అమరావతి ఉద్యమం 13 గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో చేస్తున్న ఏది రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చలేకపోయారు. చంద్రబాబు సొంత కులానికి సంబందించిన వారిది గా ముద్ర పడటంతో మొదటి నుంచి ఉద్యమం పై ఎవరికీ అంత ఆసక్తి లేదు. ఉద్యమ నాయకులూ సైతం ఇతర పార్టీల వారితో అంత అంటి ముట్టనట్లే వ్యవహరిస్తూ వచ్చారు. దింతో ఉద్యమం నీరుగారింది. తెదేపా కు అనుకూలంగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్ప ఉద్యమం జరుగుతున్నట్టు బయట ప్రపంచానికి తెలియని ఉద్యమం చేయడంలో చంద్రబాబు కుల ముద్ర కీలకం అయ్యింది. తాజాగా చంద్రబాబు జనభేరికి వెళ్లడం ద్వారా ఇక పూర్తిగా ఈ ఉద్యమాన్ని కమ్మ కులస్థులు, చంద్రబాబు అనుకూల మీడియా తప్ప మరెవరు పట్టించుకోని స్థితి లోకి వచ్చింది..
అంత ప్రేమ ఉందా మీకు?
అమరావతి మీద బాబు 5 ఏళ్ళు నాటకం ఆడారు.. నాటకం అని ఎందుకు అన్నామంటే…. ఒకసారి చైనా, సింగపూర్, టరికీ , ఇజ్రాయిల్ మోడల్ అంటూ, రకరకాల డిజైన్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ లలో చూపిస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని మాత్రమే అయన డ్రామాలు ఆడారు తప్పితే నిజంగా రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోలేదు అనే చెప్పాలి.
** అమరావతి రాజధాని అని ప్రభుత్వ గెజిట్ 5 ఏళ్ల కాలంలో బాబు ఎందుకు వేయలేదు. నోటిఫికేషన్ చేసి కచ్చితంగా రాజధాని హద్దులను ప్రకటించలేదు. దీనికి కారణం ఏంటి?? ఇలా చేసి ఉంటె ఈ రోజున న్యాయపరంగా కూడా రాజధాని తరలింపు అడ్డుకునేందుకు వీలు ఉండేది. కేంద్రానికి సైతం ఓ రూల్ ప్రకారం వెళ్లినా జగన్ కావాలనే తొండి చేస్తున్నాడు అని చెప్పుకునే వీలు ఉండేది. ఇది చంద్రబాబు చేసిన తప్పు కదా??
** శాశ్వత నిర్మాణాలు ఒక్కటి కూడా ఎందుకు మొదలు పెట్టలేదు. అయిదేళ్ల కాలంలో అన్ని తాత్కాలిక భవనాలకు సుమారు 4 వేల కోట్ల వరకు ఎందుకు ఖర్చు చేసారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటీ? శాశ్వత భవనాలు కావాలనే కట్టలేదా? అంటే రాజధాని ఇక్కడే ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదా??
** హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని అని 10 దానిపై సర్వ హక్కులు ఉంటాయని విభజన చట్టంలో ఉంటె హడావుడిగా అన్ని కార్యాలయాల తరలింపు ఎందుకు చేపట్టారు ? దీని వాళ్ళ సాధించింది ఏమిటి??
** రైతుల వద్ద భూమి తీసుకున్న సమయంలో కొన్ని నిష్పత్తులు ప్రకారం వారి వద్ద భూములు తీసుకున్నారు. వాటిలోనూ తేడాలు ఉన్నాయి. కొందరికి పక్షపాతం చూపించేలా , భూమి ధర తక్కువ చేసేలా కొందరికి అన్యాయం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేదు.
** అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రమంతా విస్తరింపచేయడానికి బాబు ఎందుకు చొరవ తీసుకోలేదు. కేవలం రెండు నగరాల్లో జోలె పట్టి రోడ్డు ఎక్కినా ఆయనకు అక్కడి ప్రజల నుంచి వచ్చిన స్పందనతో అమరావతి ఉద్యమం గురించి అర్ధం అయ్యింది. అసలు ఉద్యమంలోకి మొదట కమ్మ కులానికి చెందిన వారిని చొప్పించింది బాబే.
** ప్రభత్వం చర్చలకు పిలిచినా రైతులను, ఉద్యమం చేసే వారిని చర్చలకు వెళ్లనీయకుండా చేసింది చంద్ర బాబు. వెళ్తే జగన్ మాయలో పడిపోతారు అని… అక్కడ రైతు నాయకులకు అసలు ఎం జరిగిదో ఎందుకు జరిగిందో జగన్ వివరిస్తే మొత్తానికే ప్రమాదం అని భావించడం వల్లనే ఇప్పటివరకు ఉద్యమం విరమించకుండా…. ఎలాగోలా సాగించడానికి చంద్ర బాబు తోడ్పడుతున్నారు అన్నది మాత్రం నిజం….