Cheating Case: ఓ పోలీస్ అధికారి తనయుడికే టోకరా వేసిన టీడీపీ నేతపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఓ డీఎస్పీ కుమారుడికి తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తామని మోసం చేసినందుకు గానూ మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున యాదవ్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ సన్నిహితుడైన మల్లికార్జున యాదవ్ హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో నంద్యాల లో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ చార్జి డీఎస్పీ యుగంధర్ కుమారుడు చిరంజీవిని భాగస్వామిగా చేసుకుని కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశాడు. అయితే మల్లికార్జున యాదవ్ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడన్న అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లికార్జున యాదవ్ ఒప్పందం చేసుకున్నారు.
అయితే ఇందులో రూ.30 లక్షలు చెల్లించి మిగిలిన మొత్తం రూ.50లక్షలు చెల్లించలేదు. దీంతో చిరంజీవి నంద్యాల తాలూకా పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు మల్లికార్జున యాదవ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు.
AP IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ .. మొత్తం 30 మందికి స్థానచలనం