Koratala Siva: డైరెక్టర్ కొరటాల శివ అందరికీ సుపరిచితుడే. సినిమా ఇండస్ట్రీలో ఆయన తీసిన ఆచార్య మినహా మిగతా సినిమాలు మొత్తం బ్లాక్ బస్టర్ విజయాలు అయ్యాయి. మెసేజ్ ఓరియంటడ్ తరహాలో… ఆయన తీసే అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ రకంగానే మహేష్ బాబుతో 2015వ సంవత్సరంలో “శ్రీమంతుడు” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ విజయం సాధించింది. అయితే ఈ సినిమా స్టోరీ మాది అంటూ గత ఏడాది రైటర్ శరత్ చంద్ర కోర్టులో కేసు వేశారు. వేమూరి బలరాం నేతృత్వంలో నడిచే స్వాతి మహాస పత్రికలో ప్రచురితమైన “చచ్చేంత ప్రేమ” నవల ఆధారంగా ఈ సినిమా తీశారని ఆరోపించారు. దీంతో 1729/2017 సెక్షన్ కింద క్రిమినల్ కేసును నమోదు చేయడం జరిగింది.
ఈ కేసు పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని తీర్పు వెల్లడించింది. దీంతో ఈ అంశంపై సోమవారం విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ కొరటాలపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిటిషనర్ రచయిత శరత్ చంద్ర మొదట డైరెక్టర్ తో పాటు శ్రీమంతుడు నిర్మాతలు ఎర్నేని రవి, ఏఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై కేసు నమోదు చేయాలని.. నాంపల్లి సెషన్స్ కోర్టునీ ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు విచారణకు అంగీకరించడం జరిగింది. దీంతో కాపీ రైట్ యాక్ట్ కింద నాంపల్లి తమకిచ్చిన ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలో సినిమా నిర్మాతలు ఎర్నేని రవి, ఎంబి ఎంటర్టైన్మెంట్ లపై కాపీ రైట్ యాక్ట్ కేసు చెల్లదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో వీళ్ళపై ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదు చేయాలని శరత్ చంద్ర అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును డైరెక్టర్ కొరటాల శివ సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే ఈ వ్యవహారంలో నిర్మాతలకు సంబంధం ఉండదని దర్శకుడే విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది.