అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. తొలి దశలో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల భాషకు చెందిన ల్యాబ్లు ఏర్పాటు చేయాలని జగన్ స్పష్టం చేశారు. 14నుండి ప్రారంభమయ్యే నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రయోగ శాలలు ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. పాఠశాలలో సిబిఎస్ఈ, ఇసిఎస్ఈ విధానాలను పాటించాలని జగన్ సూచించారు.