దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అసలు రాణించ లేని పరిస్థితి కనపడటంతో కాంగ్రెస్ శ్రేణుల లో నిరుత్సాహం నెలకొంది. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నా గానీ అధికార పార్టీ పై సరైన విధంగా పోరాటం చేయకపోవడం వల్లే అదేవిధంగా నాయకత్వ లోపం వల్లే పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్నట్లు సొంత పార్టీ నేతలు భావిస్తున్నారు.
పార్టీలో ఉన్న కీలక నాయకుల మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకపోవటం వల్ల దుబ్బాక లో రాణించ లేని పరిస్థితి అని టీ కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు జిహెచ్ఎంసి పరిధిలో ఉండే ప్రాంతాలలో పర్యటనలు చేస్తున్నారు.
ఎక్కువగా ఎంపీ రేవంత్ రెడ్డి సహా ఇతర నాయకులు కీలకంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి ఎన్నికలలో సరికొత్త ప్రయోగం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయినట్లు సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించే ఆశావహులకు రుసుము నిబంధన పెట్టింది టీపీసీసీ. రిజర్వ్డ్ స్థానానికి 5 వేలు, జనరల్ స్థానానికి 10 వేలు రుసుము పెట్టింది. పోటీ చేసే కాండేట్ కచ్చితంగా రుసుము చెల్లించి గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలు పెట్టినట్లు సమాచారం. ఈ రుసుము నవంబర్ 18 వ తేదీ లోపు చెల్లించి పోటీదారులు దరఖాస్తు చేసుకోవాలని టీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక డివిజన్ పరిధిలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే ఆ డివిజన్లో సర్వే ఆధారంగా పోటీదారు ని ఎంపిక చేసుకోవటం జరుగుతుంది అని టి కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది.