(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గౌతమి బ్రిడ్జి సమీపంలో కారుల లోడుతో వెళుతున్న కంటైనర్ ప్రమాదానికి గురైంది.
చెన్నై నుండి ఒడిషాకు హోండా కార్లతో లోడుతో వెళుతున్న ఒక భారీ కంటైనర్ అదుపుతప్పి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది కంటైనర్ కేబిన్ కాలువలోకి పూర్తిగా మునిగి పోవటంతో ఎంత మంది ఉన్నారనేది తెలియవలసి ఉంది. కాలువలోకి దూసుకువెళ్లిన కంటైనర్ను బయటకు తీయడానికి పోలీసులు రావులపాలెం నుండి క్రేన్ను తీసుకొచ్చినా ప్రయోజనం లభించలేదు. దీంతో సిఐ మంగాదేవి ఒఎన్జిసి అధికారులతో మాట్లాడి భారీ క్రేన్ను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.