NewsOrbit
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటం… దీనికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో శివసేన బీజేపీ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో శివసేన నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు తెలిసింది. భగత్ సింగ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ సహా ఆరుగురు నేతలు సమావేశం అవుతారని తెలుస్తోంది.

మరోవైపు ఇతర పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా కాక రగిలిస్తున్నారు శివసేన నేతలు. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తమకి ఏకంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్‌పవార్‌ని కలిసిన తర్వాతే ఈ దూకుడు శివసేన పార్టీలో ఎక్కువైంది. శివసేనకి ఉన్న 56 మంది ఎమ్మెల్యేలకు అటు కాంగ్రెస్..ఎన్‌సిపిలను కలిపితే తప్ప ఈ సంఖ్య సాధ్యం కాదు. ఎన్సీపీ నుంచి ఖచ్చితమైన హామీ లభించింది కాబట్టే ఈ రేంజ్‌లో సంఖ్యని కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌పవార్‌లు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. శరద్ పవార్ భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించేందుకు వెళుతుండగా, ఫడ్నవీస్ బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనకు ఓ మెసేజ్‌ పంపారని దాన్ని చూపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. అందులో తనకు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉందని అయితే దానర్థం వేరని చెప్పారు. శివసేన, బీజేపీల మధ్య జరుగుతున్న వార్‌ను చాలా దగ్గరగా సమీక్షిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. తాము విపక్షంలోనే కూర్చుంటామని చెబుతున్నప్పటికీ… ఆదివారం పలువురు సీనియర్ నేతలతో శరద్ పవార్ భేటీ అయి శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన సంగతి తెలిసిందే. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆపార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఈ డిమాండ్ కు బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు. అంతేకాదు శివసేనపై మాటల యుద్దానికి పదును పెట్టారు. నవంబర్ 7వతేదీలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలనకైనా సిద్ధపడతాము కానీ శివసేనతో రాజీపడమని తేల్చిచెబుతున్నారు. శరాద్ పవర్ లో శివసేన ఎంపీ సంజయ్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది. మరోవైపు పవర్ లో కాంగ్రెస్ అధిష్టానం కూడా చర్చలు జరుపుతోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment