ప్రపంచ దేశాల రూపురేఖలను మార్చేసిన కరోనా వైరస్ మొట్టమొదట ఉద్భవించింది డ్రాగన్ కంట్రీ చైనాలో అన్న విషయం అందరికి తెలిసిందే. వుహన్ నగరంలో మొట్టమొదటిసారి బయటపడ్డ ఈ మహమ్మారి ఒక్క జోరు ఇప్పటివరకు తగ్గలేదు. అయితే అనూహ్యంగా కేవలం మూడు నెలల్లో చైనా కరోనా వైరస్ బారి నుండి బయటపడడం ప్రపంచ దేశాలు అన్నింటిని ఆశ్చర్యానికి గురి చేసింది. సరిగ్గా చెప్పాలంటే అంతా ఒక్కసారిగా ఆ న్యూస్ విని అవాక్కయ్యారు.
ఇక చైనా వారు హాయిగా స్కూళ్లు, పబ్లిక్ ప్లేసులు, షాపింగ్ మాల్స్ అన్నీ తెరచేసుకుని మళ్లీ వాళ్ళ సాధారణ జీవనశైలికి వచ్చేశారు. ఇదిలా ఉండగా చైనాలో మళ్ళీ కరోనా కేసులు ఒక్క సారిగా బయటపడడం ఇప్పుడు ఆ దేశస్థులను కలవరానికి గురిచేస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రభావం భారత దేశీయ స్టాక్ మార్కెట్ల పై పడగా స్టాక్ మార్కెట్లు అన్నీ ఈ వారం నష్టాలతో ప్రారంభించాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోను కాగా చైనా లో మళ్ళీ కరోనా మొదలైంది అన్న భయంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ భారీగా దెబ్బతినింది. ఇప్పటికైతే చైనా ప్రభుత్వం ఎప్పటిలాగే కరోనా విషయంలో గోప్యత ప్రదర్శిస్తుండగా… ఒక్క సారిగా కూలిన సూచీ ని చూస్తే అక్కడి పరిస్థితి పై ఇప్పటికే ఒక అంచనా కు వచ్చేశారు ఆర్థిక నిపుణులు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 552 పాయింట్లు పతనమై 33,228కి పడిపోయింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 9,813 వద్ద స్థిరపడింది.