Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు (ఏప్రిల్ 1వ తేదీ వరకూ) కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో పక్క తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్ట్ ఒక రాజకీయ కుట్ర అని, రాబోయే ఎన్నికల్లో దీనికి ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు.
కాగా.. కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీత కేజ్రీవాల్ కోర్టులో ఉన్నారు. కేజ్రీవాల్ను ఈ నెల 21వ తేదీన అరెస్ట్ చేయగా, 28వ తేదీ వరకు ఈడీ కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఇవేళ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కోర్టులో హజరుపర్చారు. ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు మరో నాలుగు రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
మరో పక్క ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తనని అక్రమంగా అరెస్ట్ చేసిందని, తక్షణమే ఉపశమనం కలిగించాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే.. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతరం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 2వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే కేజ్రీవాల్ కు ఓ విషయంలో మాత్రం ఊరట లభించింది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏమిటని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది.
Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం