YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ..ఎంపీ అవినాష్ రెడ్డి కి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదని అవినాష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నెల రోజుల క్రితమే ఎన్ఐఏ కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్ ను డివిజన్ బెంచ్ అనుమతించిందని హైకోర్టు పేర్కొంది. అప్రూవర్ కు అడిగే హక్కు ఉందని డివిజన్ బెంచ్ తీర్పులో స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు దస్తగిరి పిటిషన్ ను తిరస్కరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులైన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంట్ దాఖలు చేయగా.. విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం