కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ తేలినట్లు స్వయంగా ఆయనే ట్వీట్ చేసారు.
కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు అమిత్ షా. తనతో గత కొన్ని రోజులుగా కలిసిన వారందరూ ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు.
అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన పనేం లేదని స్పష్టం చేసారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని ప్రకటించారు. చారిత్రాత్మక అయోధ్య ఆలయం శంకుస్థాపనకు కేంద్రం సమాయత్తమవుతున్న వేళ ఇలా జరగడం పట్ల బిజెపి శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం అమిత్ షా త్వరగా కోలుకోవాలని ప్రముఖులు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. మొదటగా స్పందించిన వారిలో రాజ్యసభ బిజెపి ఎంపి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఉన్నారు.