నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న సంగతి తెలిసిందే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ కి 50 వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించనుండగా మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తున్నారట.
అయితే ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె నటించబోతున్నట్టు ఇప్పటి వరకు వార్తలు రాగా తాజాగా మహేష్ బాబు హీరోయిన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో సక్సస్ అందుకున్న కియారా అద్వాని ని తీసుకోవాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. పాన్ ఇండియా సినిమా కాబట్టే దీపిక పదుకొణె ని తీసుకోవాలని భావించి అప్పుడే హీరోయిన్ ని మార్చేశారా.. అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు కొన్ని కీలక పాత్రల కోసం హాలీవుడ్ అండ్ బాలీవుడ్ నటులను నాగ్ అశ్విన్ ఎంచుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారట. దాదాపు 400 కోట్లకి పైగా బడ్జెట్ ని కేటాయించిన ఈ సినిమాకి భారీ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారట.
ఇక ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డే జంటగా జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యాం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తవగా మిగతా చిత్రీకరణ కోసం ఆగస్ట్ 15 నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారట. ఇక బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ భాగ్యశ్రీ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేశారట. 2021 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!