భారత్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ కు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఇస్తూనే ఉన్నాడు మాల్యా. అవకాశం లేని బేరాలతో ఇండియాకు రాకుండా తప్పించుకుంటున్నాడు. ప్రస్తుతం చేసిన ప్రయత్నాలతో ఇక ఇండియాకు రాక తప్పదు అనుకుంటున్న తరుణంలో కొత్త డీల్ తో ముందుకొచ్చాడు మాల్యా. అపరిమితమైన రాణాలు తీసుకుని మొత్తం 17 బ్యాంకులకు బకాయి పడ్డాడు మాల్యా. ఈమేరకు రుణాలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.
అయితే.. తాను బ్యాంకులకు కట్టాల్సిన మొత్తంలో రూ. 13,960 కోట్లు చెల్లిస్తానంటూ షరతు పెట్టాడు. జూన్ నెలలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పై మొత్తానికి పరిష్కారం లభించింది. దీంతో ఈ మొత్తం చెల్లిస్తానని చెప్పడంతో.. ప్రతిసారీ ఏదొకటి చెప్పి తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టులో దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ అన్నారు. మాల్యా ఇండియాకు వచ్చేన ముందే డబ్బులను మొత్తం జమ చేయాలని ఆదేశించారు. మరి.. మాల్యా దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.