Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ లు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ చేపట్టి, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరగా, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. ఈ అనర్హత పిటిషన్ లపై ఇటీవలే విచారణ ముగించిన స్పీకర్ వారిపై వేటు వేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి స్వీకర్ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నేటితో మాజీ లు అయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం చాలా కాలం క్రితమే ఆ పార్టీని వీడి వైసీపీకి దగ్గర అయ్యారు. అధికారికంగా టీడీపీకి రాజీనామా చేయకుండానే వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో వీరి ఇప్పటి వరకూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు రీసెంట్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అభియోగంతో పార్టీ వారిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వీరు టీడీపీకి దగ్గర అయ్యారు. అయితే వీరు కూడా అధికారికంగా టీడీపీ లో చేరలేదు.
TTD: కాంట్రాక్టు, సొసైటి ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ .. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవీ..