Aging: ఇది వరకు కాలం లో వృద్దాప్యం అనేది 60 ఏళ్ల నుండి మొదలైన కూడా వారంతా ఎంతో ఆరోగ్యం ( Health ) గా ఉత్సహం గా పనులు చేసుకునేవారు. కాని ఈ కాలం లో మరీనా ఆహారపు అలవాట్లు చేస్తున్న పనుల వలన 40 ఏళ్లకే వృద్ధాప్యం తరుముకు వస్తుంది. 50 సంవత్సరాలు వచ్చే సరికి ఏ పని చేయలేని స్థితికి వచ్చేస్తున్నారు.
Aging:
ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 40 ఏళ్ల వయసు వచ్చిన ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపు అలవాట్లలో,జీవన విధానం లో మార్పులు కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వృద్దాప్యం అనేది దరి చేరదు అని నిపుణులు సూచిస్తున్నారు. వాటిగురించి తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడుతుంటాయి అవి స్ట్రాంగ్ గా ఉండేందుకు కాల్షియం బాగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు ,పెరుగు ఎక్కువ తీసుకుంటే ఎముకలు దృఢం గా ఉంటాయి.బచ్చలి కూరలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్ లు సంవృద్ధిగా ఉంటాయి. వాటితో ఫ్రీరాడికల్స్ ( Preradicals ) తొలగిపోయి..వృద్దాప్యం దరిచేరకుండా చేస్తుంది. అవిసె గింజలను క్రమం తప్పకుండ ఆహారంలో తీసుకోవడం వలన స్త్రీల హార్మోన్ల పనితీరుపై ఇవి బాగా ప్రభావం చూపి ఆరోగ్యం గా ఉండేలా చేస్తాయి అని నిపుణులు సూచిస్తున్నారు.
అవిసె గింజలను ఎక్కువగా తినడం వల్ల స్త్రీలకు వృద్దాప్య ఛాయలు ఆలస్యంగా వస్తాయి. బ్లూ బెర్రీస్ తినడం వలన మెదడు చురుకుగా పని చేస్తుంది.పాలు,టమోటాలు, గుడ్లు, చిలగడ దంపలు, రోజ్ ఆపిల్,పుట్టగొడుగులు, బాధం పప్పు, పలు రకాల పండ్లను క్రమం తప్పకుండా తినడం వలన అవయవాల పని తీరు పై వృద్దాప్యం ప్రభావం పడదు అని నిపుణులు తెలియచేస్తున్నారు