Breaking: తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మవోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ములుగు ప్రాంతంలో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
నాలుగు రోజుల క్రితం బీజాపూర్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పది మందికి పైగా మావోయిస్టులు హతమైయ్యారు. తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు మృతి చెందడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపడుతున్న భద్రతా దళాలకు వారు కనిపించారు.
అయితే భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మవోయిస్టులు మరణించారు. ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో మూడు తుపాకులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సమాచారం.
YSRCP: వైసీపీకి మరో షాక్ .. ఆ ముస్లిం మైనార్టీ ఎమ్మెల్సీ రాజీనామా