మహేష్ బాబు సర్కారు వారి పాట అన్న సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుండగా గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ మహేష్ బాబు పాన్ ఇండియన్ కేటగిరీలో తెరకెక్కబోతున్న సినిమా కావడం విశేషం.
ఇక వరసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్న మహష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో భారీ స్థాయిలో సక్సస్ ని అందుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కాని కరోనా వల్ల మహేష్ బాబు సర్కారు వారి పాట నెలలకి నెలలు వెనక్కి వెళుతూనే ఉంది. వాస్తవంగా నవంబర్ నుంచి అమెరికా షెడ్యూల్ మొదలవ్వాల్సింది. అనుకున్న ప్రకారం అమెరికా షెడ్యూల్ గనక జరిగి ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సర్కారు వారి పాట సినిమా నుంచి ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు.
కాని అమెరికా షెడ్యూల్ కాదు కదా కనీసం హైదరాబాద్ లో కూడా సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టలేకపోయారు. కరోనా వ్యాప్తి తో మహేష్ బాబు ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో షూటింగ్ మొదలు పెట్టేందుకు తొందరపడటం లేదు. కాగా గత నెల పూజా కార్యక్రమాలు నిర్వహించిన సర్కారు వారి పాట జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోందని తెలిపారు. కాని తాజా సమాచారం ప్రకారం జనవరి నుంచి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట డిలే అవుతుండటం తో ఈ గ్యాప్ లో త్రివిక్రం, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు కథ నరేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.