ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎన్నికల డిప్యూటీ కమిషనర్ సుదీప్ జైన్ను కలిశారు. అయితే సుదీప్ జైన్ హరి ప్రసాద్తో మాట్లాడేందుకు నిరాకరించారు.
దీనిపై హరి ప్రసాద్ మాట్లాడుతూ.. తన మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి తనతో మాట్లాడేందుకు సుదీప్ జైన్ నిరాకరించారని తెలిపారు. గతంలో తన మీద క్రిమినల్ కేసు నమోదు చేసిన తర్వాత కూడా వివిప్యాట్ల విషయంలో ఎన్నికల కమిషన్ తనను ఎన్నో సార్లు పిలిచిందని హరి ప్రసాద్ గుర్తు చేశారు.
ఈవిఎంలపై అనుమానాలను తీర్చాల్సిన భాద్యత అధికారులపై ఉందని హరి ప్రసాద్ పేర్కొన్నారు. సందేహాలు తీర్చకుండా పార్టీకి లేఖ రాయటం బాధాకరమని హరి ప్రసాద్ అన్నారు.
ఓటర్ల తీర్పును నిక్షిపాతం చేసే యంత్రాల పనితీరుపై నిర్లక్ష్యం తగదని హరి ప్రసాద్ హితవు పలికారు. ఎటువంటి ఈవిఎంని అయినా టాంపరింగ్ చేసే అవకాశం ఉందని హరి ప్రసాద్ తేల్చిచెప్పారు.
అంతకు ముందు విపక్షాల భేటీ అనంతరం ఈవిఎంల పని తీరుపై హరిప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈవిఎంలలో లోపాలను వివరించారు. ఓటు వేయగానే వివిప్యాట్లో అభ్యర్థి పేరు, గుర్తు కనిపించాలి. కానీ అలా కనిపించటం లేదని హరి ప్రసాద్ అన్నారు.
ఏడు సెకెన్ల పాటు వివిప్యాట్లో పేపర్ కనిపించి ఈవిఎంలో పడి పోవాలని హరి ప్రసాద్ తెలిపారు. కానీ కొన్ని వివిప్యాట్లలో పేపర్ మూడు సెకన్లు మాత్రమే కనిపిస్తుందని హరి ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఇందుకు అనుగుణంగా కోడ్ మార్చిందా అనే విషయంలో సందేహం కలిగిందన్నారు. ఒకవేళ కోడ్ మార్చి ఉంటే ఎన్నికల ఫలితాలను ఎలా నమ్మగలం అని హరి ప్రసాద్ ప్రశ్నించారు.
@ceoandhra @profoona @SpokespersonECI Tell me is it 3Seconds or 7seconds? M3 machines in AP today are showing both 7seconds & 3seconds. Are they functioning as programmed? Can provide full video I received if you ask me ? pic.twitter.com/o78jLVTcNM
— Hari Krishna Prasad Vemuru (@vhkprasad) April 11, 2019