దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ లో 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పరంగా కొన్ని రాజకీయ అరాచక శక్తులు అడ్డుకున్నారని త్వరలో వాటిని అధిగమించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తామని ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపై వైఎస్ జగన్ చెప్పడం జరిగింది.
ఇదిలా ఉండగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళలు ఏపీ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే “వైయస్సార్ ఆసరా” పథకం కింద మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడే రీతిలో జగన్ సరి కొత్త పథకాలు అమలు లోకి తీసుకురావడం మాత్రమే కాక కుటుంబంలో చదువుకునే పిల్లల చదువు బాధ్యత మహిళలపై ఉండేవిధంగా అమ్మ ఒడి అంటూ ఆర్థికంగా వారికి అండగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ముందడుగు వేసి దేశంలో మరే నాయకుడు చేయని విధంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళల పేరిట ఇళ్ల పట్టాల కార్యక్రమం జగన్ చేయటంతో ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ చేపట్టిన కార్యక్రమం పై ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ.. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించడానికి దోహదపడుతున్నాయి అని కొనియాడారు. అంత మాత్రమే కాక తాజాగా మహిళల పేరుమీద ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం దేశం మొత్తం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సుధా మూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక మహిళగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని జగన్ కి శుభాకాంక్షలు అంటూ కొనియాడారు. ఇదే తరుణంలో కరణం మల్లేశ్వరి, పి టి ఉష కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన పేదల ఇళ్ల పట్టాలు కార్యక్రమం పై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడారు.