చిన్న సినిమా అనే కాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాకైనా పక్కాగా ప్లాన్ చేసి షెడ్యూల్స్ వేసుకోకపోతే ఆ ప్రభావం మొత్తం సినిమా మీద పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఒక్క సినిమా మీద మాత్రమే కాదు ఆ సినిమా తర్వాత కమిటయిన హీరోల కి మిగతా సినిమాల మీద కూడా గట్టిగా ప్రభావం చూపిస్తుంది. ఏ సినిమా అయినా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినప్పటి నుంచి థియోటర్స్ లో సినిమా రిలీజయ్యే వరకు మేకర్స్ అనుకున్న ప్లాన్స్ లో ఎలాంటి మార్పులు లేకపోతే నిర్మాతలు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటారు.
కాని పొరపాటున గనక షూటింగ్ షెడ్యూల్స్ లో మార్పులు జరిగి బడ్జెట్ పెరిగి.. నిర్మాతకి టెన్షన్ మొదలవుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఇదే జరిగింది. లాక్ డౌన్ కి ముందు ఆర్ ఆర్ ఆర్ కోసం పూణె లో సెట్ వేసి చిత్రీకరణ జరపాలనుకున్నారు. కాని కరోనా తో అప్పుడు ఆగిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యాక గత నెల ప్రారంభం అయింది.
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ..యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా తయారవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటుంన్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీం టీజర్ సంచలనం సృష్ఠిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిణామాలే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో సినిమాకి ఎదురవుతున్నాయని అంటున్నారు.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో 5 భాషల్లో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా కి అనుకున్న కేరళ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ మొదలవలేదు.
అయితే అన్ని సినిమాల మాదిరిగా పుష్ప కూడా ఈ నెల 5 నుంచి రాజమండ్రిలోని మారేడిమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ ను ప్లాన్ చేసారు సుకుమార్ బృందం. వూడ్స్ రిసార్ట్ అలాగే రాజమండ్రిలో కొన్ని హోటళ్లు బుక్ చేసుకున్నారు. కానీ షూటింగ్ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 9 నుంచి పుష్ప షూట్ ప్రారంభం అయ్యే అవకాశం వుందట. అందుకు కారణం సెట్ పూర్తి స్థాయిలో సిద్దం కాకపోవడమే అని తెలుస్తుంది.