బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి తర్వాత మరోసారి బాలీవుడ్ లో ఉన్న నెపొటిజంపై కొందరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ మృతి చెందాడు అని చాలా మంది ఆరోపిస్తున్నారు కూడా. ఈ విషయంలో నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏకిపారేస్తుంది.
ఇక నెపొటిజంకు బ్రాండ్ అంబాసిడర్స్ కరణ్ జోహార్, మహేష్ భట్.. అంటూ చాలా కాలంగా విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఈ ఇద్దరి నుండి వచ్చిన సినిమాలు భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాయి. కరణ్ జోహార్, మహేష్ భట్ వల్లే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కెరీర్ మీద గట్టిగా ప్రభావం చూపి కెరీర్ చిక్కుల్లో పడింది.
రీసెంట్ గా కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన గుంజన్ సక్సేనా సినిమా విడుదల అయ్యింది. థియోటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా నేరుగా ఓటిటీలో రిలీజ్ చేశారు. జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు జాన్వీ కూడా విమర్శల పాలయ్యింది. గుంజన్ సక్సేనా పాత్రకు జాన్వీ ఏమాత్రం సెట్ అవ్వలేదని నటన పరంగా కూడా వేస్ట్ అంటూ రికమండేషన్ క్యాండెట్స్ ను తీసుకుంటే ఇలాగే ఉంటుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
గుంజన్ సక్సేనాకు వచ్చిన ట్రోల్స్ ఇంకా మర్చి పోకముందే సడక్ 2 రిలీజ్ అయింది. ఆలియా హీరోయిన్ గా నటించడంతో పాటు మహేష్ భట్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో ఒక రేంజ్ లో ఈ సినిమా గురించి కామెంట్ చేశారు. ఈ సినిమాకు ప్రపంచ రికార్డులను కట్టబెట్టారు. సడక్ 2 ట్రైలర్ కు యూట్యూబ్ లో అత్యధికంగా డిస్ లైక్స్ ఇవ్వడంతో ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది.
రీసెంట్ గా విడుదలైన సినిమాకు రేటింగ్ కూడా అతి తక్కువగా నమోదు కావడం ఆలియాభట్, మహేష్ భట్ ల కి షాకిచ్చింది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు అంత తక్కువ రేటింగ్ నమోదు అవ్వలేదు. సుశాంత్ మృతితో నెపోటిజం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న ఈ సమయంలో వీరిద్దరి సినిమాలు విడుదల చేయడం తప్పుడు నిర్ణయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.