water tap: చాలా మంది ఇళ్లలో టాప్ నుంచి చుక్క చుక్క నీరు పడుతుంటే పెద్దగా పట్టించుకోరు. కానీ ఏ ఇంట్లో అయినా నీరు వృథా అవుతూ ఉంటే… ఆ ఇంట్లో దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఓ ట్యాప్ నుంచి చుక్కా చుక్కా నీరు పడుతూ ఉంటే… అది మంచి సూచన కాదు అంటున్నారు నిపుణులు.అలా వాటర్ డ్రాప్ పడటం వల్ల చెడు జరుగుతుంది అని తెలియచేస్తున్నారు.
అన్నిటికన్నా ముఖ్యంగా కిచెన్లోని ట్యాప్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. అక్కడ గానీ నీరు వృధా అయితే అసలు మంచిది కాదు అని తెలియ చేస్తున్నారు. వంటగది లో అగ్ని ఉంటుంది. అక్కడ నీరు ఉంటుంది. గాలి ,ఇక భూమి ఎలాగూ ఉంటాయి. నాలుగు పంచభూతాలు ఉండే ప్రదేశం కావడంతో… అక్కడ ఏ చెడు జరగకుండా చూసుకోవాలని తెలియచేస్తున్నారు.ఒక వేళా కిచెన్లో ట్యాప్ లీకవుతూ ఉండి ఉంటే కనుక కుటుంబంలో ఒకరికి అనారోగ్యం వస్తుంది. దానితో పాటు ఆ ఇంట్లో వారు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చి డబ్బు పోతుంది. నీరు పోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారా?నీరు అంటే వరుణ దేవుడు.ఆయనకు తగిన ప్రాధాన్యత లేదని వరుణ దేవుడు ఆగ్రహిస్తాడు. అంతే… ఆయన వెళ్లిపోతూ ఉంటే, ఆ ఇంట ఉండే పాజిటివ్ ఎనర్జీ ఆయనతోపాటు వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో వెలుతురు ఉండవలసిన చోట చీకటి వచ్చినట్టు… పాజిటివ్ ఎనర్జీ లేని చోటికి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అలా అరిష్టం కలుగుతుంది. ఎవరైనా సరే ఇలాంటి లీకేజీలను నిర్లక్ష్యం గా వదిలేయకుండా వెంటనే సరిచేసుకోవాలి అని వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు.
పోనీ ఇవన్నీ మూఢ నమ్మకాలు అని పట్టించుకోని వారు సైన్స్ కోణంలో చూడండి . నీరు వృధా అయ్యే చోట,నీరు నేలపై నిల్వ ఉంటుంది. అక్కడ రకరకాల సూక్ష్మక్రిములు చేరిపోతాయి. అలాగే దోమలు గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయి. చివరకు ఆ నీరు డ్రైనేజీ నీరు మారి వాసన వస్తుంది.దోమల వలన ,చెడు వాసన వలన అనేక అనారోగ్యాలు కలిగి,హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే,డబ్బు కూడా నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుంది.కాబట్టి ఈ వాస్తు దోషాలను త్వరగా రిపేర్ చేసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు.. సరే నిపుణులు,శాస్త్రం ఇవన్నీ పక్కన పెట్టి చూసిన కూడా నీరు చాలా విలువైన వనరు. చుక్క నీటి కోసం ఎందరో అలమటించి పోతున్నారు.ఇలాంటి నీటి చుక్కలు వృథాగా పోతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి.