ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడే అమెరికాకు అధ్యక్షుడు ఇకనుంచి జో బైడెన్. డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించాడు జో బైడెన్. 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. రాజకీయాల్లో 5 దశాబ్దాల అనుభవం ఉన్న ఈయన ఎన్నో పదవులను పొందారు. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందటం కంటే డొనాల్డ్ ట్రంప్ ను ఓడించాడని ప్రపంచం అంతా చర్చించుకుంటుంది.
దీంతో జో బైడెన్ ఎవరూ.. ఆయన రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయ్యిందని చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బైడెన్ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అవి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు కానీ తన కొడుకు కూడా అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నాడని అనుకుంటే మనం పొరపడినట్లే..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరు కొడుకులు. అందులో ఒకతను 2015లో క్యాన్సర్ తో మృతిచెందాడు. మరో కొడుకు లాస్ ఏంజిల్స్లో సాధారణ పెయింటర్గా జీవితాన్ని గడుపుతున్నాడు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే టైంలో బైడెన్ కొడుకు బ్యూ 2015లో బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందాడు. మరో కొడుకు హంటర్ డ్రగ్స్ కు బానిసై డోప్ టెస్టులో పట్టుబడ్డాడు. దాంతో 2014లో అమెరికా నౌకాదళం రిజర్వ్ నుంచి తొలగించబడ్డాడు.
తర్వత అతను ఈ డ్రగ్స్ బారినుంచి బయటపడ్డాడు. కానీ తండ్రి రాజకీయాల్లోకి వెళ్లలేదు. లాస్ ఏంజిల్స్లో పెయింటర్గా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.