వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ కొందరికి టికెట్లు ఇవ్వలేదు. దీంతో ఇలాంటి వారు పొరుగు పార్టీ ల్లోకి వెళ్లి టికెట్లు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఇది సహజం. ఎవరు ఎవరినైనా ఆశించవచ్చు. ఆశ్రయిం చవచ్చు కూడా. ఇలా పొరుగు పార్టీల్లోకి వెళ్లినవారు.. అక్కడ టికెట్లు కూడా తీసుకున్నారు. వీరిలో కొందరికి టికెట్లు కూడా ప్రకటించారు. ఉదాహరణకు కొలుసు పార్థసారథి (పెనమలూరు)కి నూజివీడు టికెట్ ఇచ్చా రు. దీంతో ఆయన గురువారం అక్కడ పర్యటించారు.
అసలు నూజివీడు నాడి ఎలా ఉందో చూసుకుందామని ప్రయత్నించారు. ఎందుకంటే.. కొలుసుకు ఇది కొత్త నియోజకవర్గం. గతంలో ఎప్పుడూ పోటీ చేసిన నియోజకవర్గం కాదు. దీంతో కొద్ది మంది గ్రామస్థులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు.. వైసీపీ నాయకుడిగానే చూడడం గమనా ర్హం. నిజానికి కొందరికి కొలుసు పార్టీ మారినట్టుగా తెలియకపోవడం మరింత చిత్రం. ఆయనను చూసిన వారు ఏదో వైసీపీ తరఫున ప్రచారానికి వచ్చారని అనుకున్నారు.
ఇది వాస్తవం. కొందరు రైతులు.. కొలుసుతో మాట్లాడుతూ.. భరోసా కేంద్రాలు బాగున్నాయని చెప్పారు. ఇం కొందరు.. అన్ని పథకాలు బాగున్నాయని.. తమ ఓటు వైసీపీకేనని చెప్పడంతో కొలుసు నివ్వెర పోయారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిత్రంఏంటంటే.. తనను తాను ఇక్కడి వారికి పరిచయం చేసుకుని. వైసీపీకి తాను రిజైన్ చేశానని.. తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక్కడ మరో గమ్మత్తు జరిగింది. ఆయన అలా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడంతో వెంటనే అక్కడున్న వాళ్లంతా.. అయితే.. ఈసారి తమ ఓటు టీడీపీకేనని చెప్పడంతో కొలుసుకు నవ్వాగలేదు. అయితే, ఆయనకు మాత్రం ఒక విషయం బాగానే అర్థమైంది. వైసీపీ పథకాలు గ్రామీణ ప్రాంతంలో బలమైన ముద్ర వేశాయని గుర్తించారు. దీని నుంచి ఓటు బ్యాంకును తనవైపు మళ్లించుకునే విషయంపై ఆయన పార్టీ నాయకులతో సమావేశం పెట్టి నిర్ణయించాలని భావిస్తున్నారు.ఇదీ.. సంగతి!!