రాష్ట్ర వ్యాప్తంగా నిన్నమొన్నటి వరకు టికెట్ల కుస్తీలో అలుపెరుగని పోరులో ఉన్న టీడీపీ నాయకులు మె త్తబడ్డారు. శాంతించారు. అధినేత చంద్రబాబు నిర్ణయానికి అందరూ కలసి కట్టుగా జేజేలు పలుకుతు న్నారు. వాస్తవానికి గత నెలలో టీడీపీ, జనసేన మిత్రపక్షం తొలి జాబితా విడుదల చేసిన తర్వాత.. నాయ కులు అసమ్మతి గళం వినిపించారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలు మారుతున్నామనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి పార్టీలో ఇబ్బందికి దారితీసింది.
అయితే..అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకిదిగి.. స్థాయిలతో సంబంధం లేకుండా.. నేతలను పిలిపించుకుని, వారిని భోజనం పెట్టి మరీ బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి రావాల్సిన అవస రాన్ని వారికి పూసగుచ్చనట్టు వివరించారు. అంతేకాదు.. పలువురు నాయకులకు పార్టీ అధికారంలోకి వస్తే.. ఎలాంటి మేలు జరుగుతుందో కూడా చెప్పారు. అయినప్పటికీ.. పార్టీ నేతలు కొంతమేరకు శాంతించినా.. ఇంకా అసంతృప్తులు ఉన్నాయి.
దీనిని కూడా గమనించిన చంద్రబాబు.. నేతలకు అంతర్గతంగా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి తాను చేయించిన సర్వేల వివరాలను పంపించినట్టు తెలిసింది. పార్టీ కలసి కట్టుగా ఉంటే.. అధికారం మనేదన ని.. ముందు పార్టీ అధికారంలోకి వస్తే.. తర్వాత పదవులు దక్కించుకునే అవకాశం ఉంటుందని ఆయన సవివరంగా వెల్లడించారు. దీనికి మెజారిటీ నాయకులు సంతృప్తి చెందారు. ఇంతలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారన్న వాదన తెరమీదికి వచ్చింది.
సహజంగా.. ప్రశాంత్ కిషోర్ స్వభావం ఏంటంటే.. ఎక్కడైనా.. ఏ పార్టీ అయినా గెలుస్తుందని భావిస్తేనే ఆయన ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు ప్రాధాన్యమిస్తారు. గతంలో గోవా ఎన్నికలలో కాంగ్రెస్ తనతో కలిసి పనిచేయాలని పిలిచినప్పుడు.. ముందుగా ఆయన పార్టీ పరిస్థితిని అంచనా వేసుకున్నారు గోవాలో కాంగ్రెస్ పుంజుకునేది లేదని తెలిసిన తర్వాత.. ఆపార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏపీలో టీడీపీ గెలిచే పరిస్థితి ఉందని తెలిసిన తర్వాతే.. ఆయన బాబుతో భేటీ అయ్యారు. ఇదే.. ఇప్పుడు టీడీపీ నేతల్లో కొత్త జోష్ నింపడానికి కారణమైందని అంటున్నారు పరిశీలకులు.