కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో కున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోకు బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ షో కు ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించకుంటూ లక్షలను, కోట్లను కొల్లగొట్టేవారు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ షో ద్వారా తమ లక్ ను పరీక్షించుకుంటూ ఉంటారు చాలా మంది. ఈ షోకి వచ్చిన వారికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమితాబచ్చన్ రకరకాల క్వశ్చన్ కి వేరు వేరుగా పేమెంట్ ను పెడతారు. కాగా చాలా మంది ఈ షో లో కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు.
కొంత మంది మాత్రం కోట్లిచ్చే క్వశ్చన్ కి సరైన ఆన్సర్ చెప్పలక కోట్లను వదిలేసుకుంటారు. కాగా తాజాగా కూడా కౌన్ బనేగా కరోడ్ పతికి వచ్చిన కంటెస్టెంట్ రూ.7 కోట్ల విలువ చేసే క్వశ్చన్ కి సరైన సమాధానం చెప్పలేక క్విట్ అయ్యారు. ఇప్పుడు రన్ అవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 లో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో ఐపీఎస్ అధికారి మహితా శర్మ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. కాగా ఈమె హోస్ట్ అడిగిన 14 ప్రశ్నలకు ఎక్కడా తడబడకుండా సమాధానమిచ్చింది. అయితే రూ.7 కోట్లు విలువ చేసే ప్రశ్న కు ఆమె సమాధానం చెప్పలేక క్విట్ అయ్యారు.
మరి ఆమె ఏ ప్రశ్నను చెప్పలేకపోయారో తెలుసా.. 1817 లో ముంబైలో వాదియా గ్రూపు నిర్మించిన బ్రిటీష్ యుద్దనౌక పేరేంటి అని అమితాబచ్చన్ ఆమెను అడిగారు. దానికి ఆప్షన్స్ 1. హెచ్ ఎమ్ ఎస్ మిండెన్ 2. హెచ్ఎమ్ఎస్ కోర్న్ వాలీస్ 3. . హెచ్ఎమ్ఎస్ త్రింకోమలీ 4. హెచ్ఎమ్ఎస్ మియానీ అని ఆమెకు ఆప్షన్స్ ఇచ్చారు. కాని ఆమె సమాదానం చెప్పలేకపోయింది. దాంతో ఆమె క్విట్ అయ్యి రూ.7 కోట్లు చేజార్చుకుంది. దీనికి హెచ్ఎమ్ ఎస్ త్రింకోమలీ సమాధానం.
ఇప్పుడు ఈ నౌక రాయల్ నేవీ జాతీయ మ్యూజియంలో ఉందని హోస్ట్ అమితాబచ్చన్ తెలిపారు. కాగా ఈ ఐపీఎస్ ఆఫీసర్ కంటే ముందే మొదటి కంటెస్టెంట్ గా నజీయా నసీమ్ పాల్గొన్నారు. ఆమె కూడా రూ.7 కోట్లు విలువ గల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక క్విట్ అయ్యారు. ఈ సందర్బంగా నజియా మాట్లాడుతూ.. ఈ స్టేజ్ మీదకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రూ.7 కోట్లు పోగొట్టుకున్నానని నేను బాధపడటం లేదు. కేవలం ఈ స్టేజి మీదకు రావాలన్న మా అమ్మా కోరికను తీర్చినందుకు ఆనందంగా ఉన్నానని నజియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.