Mahesh Babu: త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకడు. అతని దర్శకత్వంలోని సినిమా చేయడానికి ఎంతో మంది కుర్ర హీరోలు, పెద్ద హీరోలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించడానికి ఆలోచిస్తున్నాడు. ప్రిన్స్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇప్పటికే అతడు, ఖలేజా అనే రెండు సినిమాలో నటించాడు. అయితే ఖలేజా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో త్రివిక్రమ్ తో మరో సినిమా అంటేనే మహేష్ బాబుకి వణుకు వచ్చేస్తోంది.
Mahesh Babu: త్రివిక్రమ్ ఖాతాలో ఎన్నో హిట్స్ కానీ మహేష్..?
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
త్రివిక్రమ్ ఖలేజా తర్వాత అల్లు అర్జున్తో కలిసి ‘జులాయి’ సినిమాని తెరకెక్కించగా అది సూపర్ హిట్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ తీయగా అది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమాతో మళ్లీ పరాజయం పాలయ్యాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అరవింద సమేత మూవీతో మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీతో కలిసి అల వైకుంఠపురములో మూవీ తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బన్నీ లైఫ్లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయినా కూడా త్రివిక్రమ్ ప్రతిభపై మహేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
త్రివిక్రమ్కు తప్పని తిప్పలు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయాలని అనుకున్నాడు కానీ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు. దీంతో మహేష్ బాబుతో మూవీ చేయదలిచాడు త్రివిక్రమ్. మహేష్ అమెరికాలో వున్నపుడు ఒక స్క్రిప్ట్ గురించి చెప్పాడు. ఆ తరువాత దుబాయ్ లో ఉన్నపుడు కూడా అదే స్క్రిప్ట్ గురించి చర్చలు జరిపాడు. కానీ ప్రిన్స్ మాత్రం ఓకే చెప్పలేదు. దీంతో తాజాగా అమెరికా నుంచి తిరిగొచ్చిన మహేష్ కి త్రివిక్రమ్ మళ్లీ స్క్రిప్ట్ వినిపించాడు. అప్పటికిగానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా దారుణంగా ఫెయిల్ అవ్వడంతో మహేష్ మళ్లీ అతనితో కలిసి మూవీ తీసేందుకు భయపడిపోతున్నాడు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత స్క్రిప్ట్ పూర్తిగా విన్న తర్వాతే తన నిర్ణయాన్ని చెబుతున్నాడు. ఇక త్రివిక్రమ్ తో చేదు అనుభవం ఉంది కాబట్టే అతని చేత నాలుగైదుసార్లు స్క్రిప్ట్ వినిపించుకుని.. ఫైనల్ స్క్రిప్ట్ విన్న తర్వాతనే ఓకే చెప్పాడు. మహేష్ స్క్రిప్ట్ సెలక్షన్ తీరు గురించి తెలుసుకున్న అభిమానులు ఫిదా అవుతున్నారు. మంచిగా లేని సినిమా తీస్తే ప్రేక్షకులతో పాటు మూవీ యూనిట్ కూడా నష్టమే మిగులుతుందని.. కానీ ఆ నష్టం రాకుండా మహేష్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మెచ్చుకోదగిన విషయం ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.