బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సరిగ్గా టాప్ ఫైకి వెళ్లకముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మోనాల్. గుజరాతి నుండి వచ్చిన అమ్మాయి తెలుగులో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ హౌస్ లో ప్రారంభంలో ప్రతిసారీ ఏడుస్తూ ఆడియన్స్ నుండి నెగిటివిటీ ఎదుర్కోవటం జరిగింది. ఆ తర్వాత అఖిల్, అభి తో క్లోజ్ గా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది.
మధ్యలో అభితో గొడవలు కావటంతో..అఖిల్ తో క్లోజ్ గా హౌస్ ల బాండింగ్ ఏర్పరచుకుని ఇప్పటికే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇదిలా ఉండగా హౌస్ లో చివరిలో గేమ్ టాప్ కంటెస్టెంట్ కి పోటీ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఓంకార్ ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ కార్యక్రమంలో జడ్జ్ గా మోనాల్ చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో ఇండస్ట్రీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ అవకాశం అందుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత హైదరాబాదులోని మొన్నటి వరకు ఉండగా తాజాగా సొంత ఊరు అహ్మదాబాద్ కి మోనాల్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి నుండి సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటూ అనేక విషయాలు చెప్పుకొచ్చింది. త్వరలోనే ఫ్యామిలీ తో మకాం మొత్తం హైదరాబాద్ కి రాబోతున్నట్లు మోనాల్ తెలిపింది. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే హైదరాబాదులోనే ఉండటం మంచిదన్న ఉద్దేశంతో ఈ అమ్మడు హైదరాబాద్ కు షిప్ట్ అవ్వబోతున్నట్లుగా పేర్కొంది.