ఇన్స్పిరేషన్ అంశాలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తున్న తరుణమిది. ఈ క్రమంలో పలువురి బయోపిక్స్తో పాటు నిజ ఘటనల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో కార్గిల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుడు విక్రమ్ బాత్రా కథ సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి `షేర్షా` అనే టైటిల్ను నిర్ణయించారు. కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు. కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మెహతా, షబీర్ బాక్స్వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!